చిత్తూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శిగా శాంతిపురం మండలానికి చెందిన వినోద్ కుమార్ ను నియమిస్తున్నట్లు కుప్పం నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ భరత్ తెలియచేశారు. తనపై నమ్మకంతో పార్టీ పదవి ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ భరత్ కు వినోద్ కృతజ్ఞతలు తెలియచేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.