ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌ను సందర్శించనున్న యూపీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2017, 03:01 PM

లక్నో: ఉత్తరప్రదేశ్ టూరిజం బ్రోచర్‌లోనే స్థానం కోల్పోయిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను వచ్చే వారం సందర్శించనున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అందులోనూ అది దేశద్రోహులు నిర్మించిన కట్టడమని బీజేపీ ఎమ్మెల్యే సోమ్ చేసిన వివాదాస్పద కామెంట్స్ నేపథ్యంలో యోగి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పర్యాటక పథకాలతోపాటు పలు ఇతర పథకాల సమీక్షలో భాగంగా ఈ నెల 26న ఆగ్రా వెళ్లనున్న యోగి.. తాజ్‌మహల్, ఆగ్రా కోటలను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజ్‌మహల్ వ్యవహారంలో యూపీ ప్రభుత్వానికి జరిగిన నష్ట నివారణ చర్యల్లో భాగంగానే యోగి పర్యటన అని విశ్లేషకులు చెబుతున్నారు. తాజ్‌మహల్ భారతీయ సంస్కృతికి అద్దం పట్టదని గతంలో యోగి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com