ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి జిల్లాకో ఆయుర్వేద హాస్పటల్ : ప్రధాని మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2017, 12:42 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. రెండవ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆయన ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ప్రతి జిల్లాకు ఓ ఆయుర్వే ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆ దిశగా చర్యలు చేపడుతున్నదని ఆయన అన్నారు. ఆయుర్వేద విస్తరణ కోసం ఆసుపత్రుల ఏర్పాటు ఉపయోగపడుతుందన్నారు. గత మూడేండ్లలో దేశంలో 65 ఆయుర్వేద హాస్పటళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయుర్వేదం అనేది ఒక చికిత్సా విధానం మాత్రమే కాదు అని, ఆ పద్ధతి ద్వారా సామాజిక, పర్యావరణ స్వస్థత ఏర్పడుతుందని మోదీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com