పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో కుటుంబ కలహాల కారణంగా తండ్రి రామారావును కుమారుడు వెంకటరమణ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.