గత కొన్ని రోజులుగా ముడిపట్టు ధరలు పెరిగి చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలకు సెరిఫెడ్ ద్వారా రాయితీ ఇచ్చి చేనేత పరిశ్రమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ వినతిపత్రం అందజేయడం జరిగింది. “ఎన్నికల్లో వైసీపీ చేనేత కార్మికులకు 45ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని అమలు చేయాలి. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి.” అని కోరారు.