చిత్తూరు: బుచ్చినాయుడుకండ్రిగ మండలం లోని నెలవాయి, కల్లివేటు, తలారివెట్టు, వేణుగోపాలపురం గ్రామాల్లో రైతులు జోరుగా వరి కోతలు కోస్తున్నారు. ఈ గ్రామాలలో రబీ సీజన్లో రైతులు 1450 ఎకరాల్లో వరి సాగు చేశారు. భారీ వర్షాలకు చెరువుల నీటితోనే పంటలు పండాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.