వట్టిచెరుకూరు మండలం లోని కుర్నూతలలో వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో గాయాలపాలైన క్షతగాత్రులు ఇద్దరు చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
ఈ నెల 6న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గడియాదేవి సిమ్రాన్ కుమారి(15), నంద పూజ కుమార్(30) మృతిచెందారు. మృతదేహాలను తహశీల్దారు నాసరయ్య ఎస్సై కోటేశ్వరరావు, వీఆర్వో శ్రీనివాసరావు పరిశీలించారు. గడియా దేవి, తులసి, నిరాశకుమారి, కుందీన్లు చికిత్స పొందుతున్నారు.