విద్యుత్ బోర్డ్ లోపల విషసర్పం చేరి విద్యుత్ శాఖ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసిన ఘటన
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఓ పంట పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశీలించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి వెళ్లగా విషసర్పం కాటు వేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చు కున్నారు. ఉండవల్లి ప్రాంతంలోని పంటపొలాల్లో చిన్నడొంకకు, కరకట్టకు మధ్య ఉన్న రామిరెడ్డి పంట పొలంలో త్రీఫేజ్ సరఫరా ఉంది. విద్యుత్ సరఫరా సరిగా రాకపోవడంతో రోజుల కిందట ఫిర్యాదు చేశారు. సిబ్బంది దానిని పరిశీలించేందుకు వెళ్లగా విద్యుత్ మీటరుకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాక్స్ లని (ప్యానల్ బాక్స్) తెరిచాడు. అప్పటికే అందులో ఉన్న పాము లైన్మన్ తలపై కాటు వేసేందుకు ప్రయత్నించింది. లైన్ మన్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. పాము మీటర్లో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయింది. దీంతో ఎటువంటి ప్రమాదం జరగగలేదు. పొలాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా ఎదురౌతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.