రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతుండటంతో కొన్ని వస్తువుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కార్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహాలు, ఖనిజాల ధరల కారణంగా అన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి. ఇదే సమయంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.