రైల్వే టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైల్వే హోటల్ టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో లాలూ తనయుడు తేజస్వీ కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు