ప్రముఖ బాలీవుడ్ నేపథ్యగాయని ఆశాభోంస్లే (84) మైనపు విగ్రహాం ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మంగళవారం కొలువుదీరింది. మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆశాభోంస్లే దానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్చేశారు. ఈ అరుదైన గౌరవం ఇచ్చిన మేడం టూస్సాడ్స్ మ్యూజియంకు, అభిమానులకు ధన్యవాదాలు. మైనపు బొమ్మను చూస్తుంటే చక్కని అనుభూతి కలుగుతున్నది. ఇది నాకు కొత్త అనుభవం అని ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 1న ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయం ఆవిష్కరణ కార్యక్రమం జరుగనున్నది. ఇక్కడ ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సల్మాన్ఖాన్, రణబీర్కపూర్, కపిల్దేవ్ మైనపు విగ్రహాలు ఉన్నాయి.