ప్రముఖ రీసెర్చ్ సంస్థ హ్యూరన్ రూపొందించిన భారత్ లోని అత్యంత ధనవంతుల జాబితాలో... యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితుడైన పతంజలి సంస్థల అధినేత బాలకృష్ణకు చోటు దక్కింది. పతంజలి ఉత్పత్తుల భారీ అమ్మకాలతో ఆయన ఆస్తి విలువ అమాంతం పెరుగుతోంది. గతంలో వెలువరించిన జాబితాలో బాలకృష్ణ 25వ స్థానంలో ఉండగా తాజా జాబితాలో ఆయన టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నారు. ఏకంగా 17 స్థానాలను ఎగబాకిన ఆయన టాప్ 8 ధనవంతుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా 173 శాతం పెరిగి రూ. 70 వేల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మరోసారి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.