రాంచీ : ఝార్ఖండ్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కుమార్డూబి ప్రాంతంలోని ఓ బాణసంచా పరిశ్రమలో మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. 25 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు