శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం, దంత గ్రామంలో పేకాట శిబిరంపై కోటబొమ్మాలి ఎస్ఐ వై. రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి, ముగ్గురిని అరెస్టు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ. 2600 లు నగదును స్వాదీనం చేసుకుని, కేసు నమోదు చేశామన్నారు.