నేటి సాయంత్రానికి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించాలని ఏపీ మంత్రుల కమిటీ నిర్ణయించింది. పీఆర్సీపై ఏపీ మంత్రుల కమిటీతో యూనియన్ చర్చలు అసంపూర్తిగా ఉన్నాయి. మంత్రుల కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. మంత్రుల కమిటీ చర్చించి మళ్లీ చెబుతామని చెప్పారు. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీని ఆదేశించింది. . అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. పీఆర్సీ జీవోలను రద్దు చేసి పాత జీతాలు ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మంత్రులు కమిటీ కోరింది. మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే తమ కార్యాచరణపై చర్చిస్తామని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. జీతాల విషయంలో తొందర ఎందుకని స్టీరింగ్ కమిటీ ప్రశ్నించింది.. సాయంత్రానికి అందరికీ జీతాలు ఇస్తున్నట్లు మంత్రుల కమిటీ పేర్కొంది.