ఆంద్రా లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నిన్నటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కర్ఫ్యూను మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈనెల 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించడం జరిగింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.