కోల్కతా: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఆసీస్ మధ్య రెండో వన్డే మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. మరోపక్క ఆసీస్ మాత్రం జట్టులో రెండు మార్పులు చేసింది. ఫాల్కనర్, జంపా స్థానంలో రిచర్డ్సన్, అగర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్కు ఇది 100వ వన్డే.