తూర్పు గోదావరి: ప్రియురాలు మోసం చేసిందని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడిన సంఘటన అయినవిల్లి మాగం కొప్పిశెట్టివారి పాలెంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రియురాలు మోసం చేసిందని కొప్పిశెట్టివారి పాలెంలో కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన వద్ద భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని సెల్ఫీ వీడియోలో యువకుడు వాపోయాడు. యువతితో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహం జరగ్గా విడిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది