తూర్పు గోదావరి: పి. గన్నవరం మండలం ముంగండ గ్రామ వాలంటీర్గా పని చేస్తున్న చప్పిడి సూర్య పద్మిని అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ వాలంటీర్లు పద్మిని భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ఎంపీడీవో కుమార్, ఎంపీపీ అంబటి భూలక్ష్మి, సర్పంచ్ కుసుమ చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.