పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో శుక్రవారం రోడ్డు పక్కన బాంబు పేలింది.ఈ పేలుడులో 4 మంది మృతి చెందారు, 10 మంది గాయపడ్డారు. డేరా బుగ్తీ జిల్లాలోని మాట్ ప్రాంతంలో బాధితులు వాహనంలో వెళ్తుండగా పేలుడు సంభవించింది.బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిని ధ్వంసం చేసేందుకు శత్రువులు మరోసారి పిరికిపంద ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారని అన్నారు.