దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి అయితే ఇన్వెస్టర్లు చివరికి లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరికి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 76 పాయింట్లు నష్టపోయి 57,200 వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 17,101 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:ఎన్టీపీసీ (3.89%), సన్ ఫార్మా (1.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.72%), మహీంద్రా & మహీంద్రా (1.38%), విప్రో (1.37%). టాప్ లూజర్స్: మారుతీ సుజుకీ (-2.99%), టెక్ మహీంద్రా (-2.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.14%), ICICI బ్యాంక్ (-1.62%), యాక్సిస్ బ్యాంక్ (-1.08%).