కృష్ణ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1056 కరోనా కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య అధికారులు శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. గురువారం 873 కేసులు నమోదు అవగా శుక్రవారం 183 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం వచ్చిన కేసులతో కలిపి ప్రస్తుతం జిల్లాలో 7385 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 1482 మంది కరోనా బారినపడి మృతి చెందారు.
కృష్ణ జిల్లాలో కరోనా మొదటి, రెండో దశలలో భారీగా కేసులు నమోదు అవ్వడంతో పాటు చాలా మంది మృతి చెందారు. మళ్ళీ కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ ను, నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కావున ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇంట్లో నుంచి అవసరం అయితేనే బయటికి రావాలని, వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.