కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో క్యాసినో నిర్వహించారని టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని. తీవ్రంగా స్పందించారు. సంక్రాంతి సంబరాలు గుడివాడ ప్రజలకు ఏంటో చూపిస్తాయని బీజేపీ నేతలు అనడం సరికాదన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై కొడాలి నాని ఎదురుదాడికి దిగారు.
ఎక్కడ చర్చ జరిగినా వచ్చి చంద్రబాబు కి సమాధానం చెప్పగలనని కొడాలి నాని సవాల్ విసిరారు. .కోడలి నాని టీడీపీలో ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడు. వైసీపీలో ఉంటే అవినీతి పరుడా.? అని ప్రశ్నించారు.
ఈ విషయం పై టీడీపీ, బీజేపీ నేతలు.. గవర్నర్ను కలిస్తే తనకు ఇబ్బంది ఉండదని.. అవసరమైతే వాళ్ళు ఈ విషయంలో రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లిన అభ్యంతరం లేదని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్న చంద్రబాబు నన్ను విమర్శించే స్థాయి లేదన్నారు నాని. గతంలో చంద్రబాబు వల్ల ఇబ్బంది పడిన వాళ్లంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని నాని హెచ్చరిస్తున్నారు.
తనను విమర్శించే వారికి.. కొడాలి నాని సూటిగా సవాల్ విసిరారు. ఏ పార్టీ అధినేత తనపై విమర్శలు చేసినా గంటలోగా తగిన సమాధానం చెబుతానని ధీమాగా వ్యక్తం చేసారు. క్యాసినోతో తనకు సంబంధం లేదు కాబట్టే పెట్రోల్ పోసుకుని చనిపోతానని చెప్పానని నాని గుర్తు చేసారు. గతంలో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పేకాట ఆడారని ఆరోపించారు. చంద్రబాబును గతంలో ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తనకు చెప్పారన్నారు. అలాంటి నేతలు తనపై ఆరోపణలు చేస్తే.. తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమన్నారు.