ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం తో సత్కారం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 07:06 PM

నీరజ్ చోప్రా ఇప్పుడు ఈ పేరు తెలీని వారు లేరు. లేటెస్ట్ గా గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో 121 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు నీరజ్. నీరజ్‌ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్‌ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది. జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నీరజ్‌చోప్రాకు పతకం అందించనున్నాడు. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్‌ ఆర్మీలో నీరజ్‌ చోప్రా జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com