ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు వీర జవాను జశ్వంత్ రెడ్డికి 'శౌర్య చక్ర'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 06:53 PM

గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డి గతేడాది జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరులో అమరుడయ్యాడు. రాజౌరిలో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన జశ్వంత్ రెడ్డి తీవ్రగాయాలతో వీరమరణం పొందాడు. నాటి టెర్రర్ ఆపరేషన్ సందర్భంగా తన టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడిన ఈ యువ సిపాయి తాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో జశ్వంత్ రెడ్డికి కేంద్రం మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం ప్రకటించింది. జశ్వంత్ రెడ్డి 2016లో సైన్యంలో చేరాడు. మద్రాస్ రెజిమెంట్ లో శిక్షణ పొంది, తొలుత నీలగిరి వద్ద విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ కు బదిలీపై వెళ్లాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com