ఎలాగైనా సరే యూపీలో తిరిగి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ తనదైన శైలీలో వ్యూహాలను పదునుపెడుతోంది. యూపీలో మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా యోగీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు తోడు స్ధానికంగా బీజేపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా ఈసారి తమ కొంప ముంచేలా ఉందని భావిస్తున్న కాషాయ సేన.. ఈసారి టికెట్ల కేటాయింపులో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు కావొచ్చు: అమెరికా మెగా మిలియన్స్ లాటరీతో..ఎలా ఆడాలంటే..!! 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఈసారి బీజేపీ గెలిచి తీరాలంటే కచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లలో పలు మార్పులు చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. అయితే భారీ సంఖ్యలో మార్పులు చేస్తే తప్ప బీజేపీ గెలుపు కష్టమనే అంచనాలతో కాషాయ పార్టీ అందుకు సిద్ధమవుతోంది. దీంతో ఏకంగా 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తోంది. చిత్తూరులో దళిత మహిళపై ఖాకీల క్రౌర్యం .. జాతీయ మహిళా కమిషన్కు వంగలపూడి అనిత లేఖ త్వరలో బీజేపీ చివరి అభ్యర్ధుల జాబితా విడుదల కానుండగా... ఇందులో 80 మంది సిట్టింగ్ లను మార్చేందుకు నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో 12 స్ధానాల్లో అభ్యర్ధుల్ని ఇతర సీట్లకు మార్చబోతున్నారు. తద్వారా ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు యోగీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. నిన్న ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతున్నారు. ఈ కమిటీ ఇవాళ సమావేశమై యూపీ అభ్యర్ధుల తుది జాబితాను ఖరారు చేయనుంది. ఊహించినట్లుగానే బీజేపీ భారీ మార్పులకు ప్రయత్నిస్తే అప్పుడు నేతల వలసలు కూడా పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి.