ముస్లింలు అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర కాదనలేనిది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన ఎంఐఎం ఈసారి తనదైన వ్యూహాల్ని అమలు చేస్తోంది. యూపీ పోరులో మొత్తం 27 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎంఐఎం... అందులో నలుగురు హిందువులకు కూడా టికెట్లు కేటాయించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకూ మతం ఆధారంగా రాజకీయాలు చేసిన ఎంఐఎం... యూపీ వంటి రాష్ట్రంలో హిందువులకు టికెట్లు ఇచ్చి మరీ బరిలోకి దింపుతుండటం బీజేపీకి లాభిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు కావొచ్చు: అమెరికా మెగా మిలియన్స్ లాటరీతో..ఎలా ఆడాలంటే..!! ఎంఐఎం ఇప్పటివరకూ తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు హిందూ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. వీరిలో ఘజియాబాద్ లోని సాహిబాబాద్ సీటు నుంచి పండిట్ మన్మోహన్ ఝా, ముజఫర్ నగర్ పరిధిలోకి వచ్చే బుధానా సీటు నుంచి భీమ్ సింగ్ బల్యాన్, మీరట్ లోని హస్తినాపూర్ సీటు నుంచి వినోద్ జాతవ్, బారాబంకిలోని రామ్ నగర్ నుంచి వికాస్ శ్రీవాస్తవ పోటీ చేయబోతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక తప్పేలా లేదు. దీనిపై స్పందించిన ఎంఐఎం నేతలు.. తాము మతం ఆధారంగా టికెట్లు ఇవ్వబోమని చెప్తున్నారు. చిత్తూరులో దళిత మహిళపై ఖాకీల క్రౌర్యం .. జాతీయ మహిళా కమిషన్కు వంగలపూడి అనిత లేఖ గతంలో ముస్లింలను బరిలోకి దించడం ద్వారా సెక్యులర్ పార్టీల ఓట్లు చీలుస్తోందనే ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఈసారి.. హిందూ అభ్యర్ధుల్ని పోటీలో పెట్టడం ద్వారా ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో హిందూ అభ్యర్ధుల్ని రంగంలోకి దింపడం ద్వారా ఎంఐఎం ఏ మేరకు లబ్ది పొందుతున్నదానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో ఎంఐఎం పోటీ ఎవరికి లాభిస్తుందన్న దానిపైనా విస్తృత చర్చలు సాగుతున్నాయి.