దేశంలోని అటవీ స్థితిగతులకు సంబంధించిన నివేదిక 2021 ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అడవుల విస్తీర్ణంలో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. 647 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఒడిశా 537 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మూడో స్థానం దక్కించుకుంది. గత రెండేళ్లలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. గత రెండేళ్లలో పోలిస్తే ఏపీలో 2.22 శాతం, తెలంగాణలో 3.07 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది.