ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్‌టీతో కలిపి టికెట్‌ ఎంతంటే..

Andhra Pradesh Telugu |   | Published : Tue, Sep 12, 2017, 10:13 AM

ఇండోర్‌: భారత్‌, ఆస్ట్రేలియా మూడో వన్డేకు టికెట్ల ధరలు నిర్ణయించామని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) తెలిపింది. సెప్టెంబర్‌ 24న ఇండోర్‌లోని హోల్కర్‌ మైదానంలో కోహ్లీసేనతో స్మిత్‌ బృందం తలపడనుంది. టికెట్ల ధరలు రూ.250- రూ.5,120 శ్రేణిలో ఉంటాయని ఎంపీఏసీ కార్యదర్శి మిలింద్‌ వెల్లడించారు. 28 శాతం జీఎస్టీ కలిపే ఉంటుందన్నారు. దాదాపు 20,000 టికెట్లు ఆన్‌లైన్‌, క్యాష్‌ కౌంటర్ల ద్వారా విక్రయిస్తామన్నారు. 28,500 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న హోల్కర్‌ మైదానంలో మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సీటింగ్‌ వ్యవస్థ ఉందన్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌ సెప్టెంబర్‌ 17న ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com