విశాఖపట్నం నగరంలోని సముద్ర తీరంలో నాలుగు బోట్లు దగ్ధం అయ్యాయి. చేపలు పట్టేందుకు ఉపయోగించే రింగ్ నెట్స్ విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ లో సంప్రదాయ మత్స్యకారులు మరో బోటుకు నిప్పు పెట్టారు. దానితో మంటల్లో మొత్తం నాలుగు బోట్లు దగ్ధమయ్యాయి. పోలీసులు ఒడ్డున ఉండగానే మత్స్యకారులు సముద్రంలో పడవలకు నిప్పు పెట్టారు. ఈ పరిస్థితిలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.