ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న విద్యాకానుకపై మంత్రి సురేష్‌ ఆరా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 04, 2022, 05:19 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ‘జగనన్న విద్యా కానుక’. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే  ఈ కార్యక్రమం పై నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  విద్యాశాఖ ఉన్నతాధికారులతో  సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి సురేశ్‌ విద్యార్హతపై ఆరా తీశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, కమిషనర్‌ సురేశ్‌కుమార్‌, సమగ్ర శిక్షా విభాగం ఎస్పీ వెట్రిసెల్వి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com