ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం ‘జగనన్న విద్యా కానుక’. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే ఈ కార్యక్రమం పై నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి సురేశ్ విద్యార్హతపై ఆరా తీశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేశ్కుమార్, సమగ్ర శిక్షా విభాగం ఎస్పీ వెట్రిసెల్వి పాల్గొన్నారు.