ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ సీఎం యోగి ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2017, 12:48 PM

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. యోగితో పాటు డిప్యూటీ సీఎంలు కేపీ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు ఎస్డీ సింగ్, మోహసిన్ రజా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనమండలికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మ‌ధ్యే ఎస్పీ నుంచి న‌లుగురు, బీఎస్పీ నుంచి ఒక‌రు కౌన్సిల్‌కు రాజీనామా చేసిన విష‌యం విదితమే. సెప్టెంబర్ 15న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. మార్చి నెలలో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. మార్చి 19న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆరు నెలల(సెప్టెంబర్ 19)లోపు యూపీ అసెంబ్లీకి యోగి ఎన్నిక కావాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com