న్యూఢిల్లీ: రజస్వ జ్ఞాన సంఘం సమావేశాన్ని ఇవాళ ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. 2022లోగా దేశీయ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ను పెంచేందుకు కచ్చితమైన టార్గెట్లను పెట్టుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఆదాయపన్నుకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అంశాల పట్ల ప్రధాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేసులు క్లియర్ అయితే, వాటిల్లో ఇరుక్కున్న డబ్బును పేద ప్రజల పథకాల కోసం వినియోగించే అవకాశాలున్నాయన్నారు. వర్క కల్చర్ను మరింత మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోదీ ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్స్కు సూచించారు.