తమిళనాడులోని కూనురు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్ లిద్దర్, కల్నల్ హార్జిందర్ సింగ్, పీఎస్వోలు గురు సేవక్ సింగ్, జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, సాయితేజ, సత్ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుమార్తె కూడా ఉన్నట్లు సమాచారం. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 9 మంది ప్రయాణించినట్లు చెబుతున్నారు. ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.