విజయనగరం: పాత బండికి కొత్త ఫేక్ నెంబర్ తగిలించి దర్జాగా తిరుగుతున్న హంతకులను విజయనగరం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే 2016లో కేతవరం సత్యనారాయణ అనే వ్యక్తిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో, ఈనెల 1వ తేదీన కొత్తపేట నీళ్ల ట్యాంక్ దగ్గర పోలీసులు చేస్తున్న వాహన తనిఖీలలో మిస్సయిన వ్యక్తి యొక్క హోండా యాక్టివా ను స్వాధీనం చేసుకొని, నిందితులను విచారించగా అసలు విషయం బయటపడిందని పట్టణ డిఎస్పి అనిల్ పుల్ పాటి తెలిపారు. గురువారం డిఎస్పీ అనిల్ కుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేతవరపు సత్యనారాయణ దగ్గర మామిడి పాక పేర్ల అనే వ్యక్తి70 వేల రూపాయలు అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో, సత్యనారాయణ అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని, పేర్లు తన స్నేహితుల సహాయంతో పథకం ప్రకారం హత్య చేసి మృతుని వంటిపై ఉన్న నాలుగు ఉంగరాలు బ్రాస్లెట్ తీసుకుని పెట్రోల్ పోసి కాల్చి చాకచక్యంగా ఏమీ చేయనట్టు ఇన్ని రోజులుగా దర్జాగా తిరుగుతున్నారని తెలిపారు. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో నిందితున్ని పట్టుకొని విచారించగా , నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. హత్యకు సహకరించిన నలుగురు ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు