తూర్పు గోదావరి: డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు భద్రత ఏర్పడుతుందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. గురువారం మలికిపురం మండల పరిషత్ కార్యాలయములో గృహ హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని వివరించారు. ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉందని గుర్తుచేశారు. 1980 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా వన్టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయని, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చని, తద్వారా పేదలకు చాలా మంచి జరుగుతుందన్నారు.