చిత్తూరు: రామకుప్పం మండలంలో ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురిఅయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రంలో పొగమంచులో కమ్మేసింది. జాతీయరహదారిపై ప్రయాణం ఇబ్బంది కావటంతో కొందరు వాహనాలను నిలుపుకున్నారు. ముఖ్యంగా పలమనేరు క్రిష్ణగిరి రహదారిపై ఎక్కువగా పొగమంచు పేరుకుపోయింది. దీంతో వాహనాలలో వెల్లేవారు లైట్లు వేసుకుని వాహనాలను నడుపుకుంటూ వెల్లారు.