గుంటూరు: పిచ్చికుక్క దాడి చేయడంతో 15 మంది వ్యక్తులకు తీవ్రగాయాలైన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... స్థానిక ఫిల్టర్హౌస్, దేశవరపు క్యాంపు తండా ప్రాజెక్టు హాస్పిటల్ ప్రదేశాల్లో ఇంటి బయట ఉన్న వారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో మహిళ, చిన్నారితోపాటు 15 మంది వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుప త్రికి తరలించి చికిత్స అందించారు.
పిచ్చికుక్క స్థానికులపై విచక్షణా రహితంగా దాడి చేస్తుండటంతో అక్కడే ఉన్న గ్రామ వలంటీర్ ఎస్ కే జుబేర్, అప్పలస్వామి, శ్రీను, నాగేశ్వరరావు, నాగరాజులు కుక్కను వెంబడించి మట్టుబెట్టారు. గత కొంతకా లంగా పర్యటక కేంద్రమైన విజయపురిసౌత్ లో వీధి కుక్కల బెడద ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల పాఠశాలకు వెళ్లే విద్యా ర్డులపై వీధికుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికు లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం సరికాదని వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.