ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. యువతి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

national |  Suryaa Desk  | Published : Mon, Nov 29, 2021, 01:42 PM

యూపీలోని కాన్పూర్ జిల్లాలో ఓ యువతి సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన సెజల్ జైన్‌ అనే యువతి కాన్పూర్ ఐఐటీలో చదువుతోంది. ఆమె స్నేహితులతో కలిసి గంగా బ్యారేజీ వద్దకు వెళ్లింది. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గంగా నదిలో పడిపోయింది. అక్కడే ఉన్న తోటి స్నేహితులు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల బృందాన్ని రప్పించారు. సుమారు గంటపాటు బాలిక కోసం వెతికారు. కొంత సమయం తర్వాత ఆమె దొరికింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com