అనంతపురం: అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. గోరంట్ల మండలం బూదిలికి చెందిన ఆదెమ్మ కర్నాటక నుంచి మద్యం తీసుకొస్తుండగా కొడికొండ చెక్పోస్టువద్ద అదుపులోకి తీసుకుని మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోడూరు తోపువద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చొండూరువాండ్లపల్లికి చెందిన వడ్డె శ్రీరాములును అదుపులోకి తీసుకుని ద్విచక్రవాహనంను సీజ్ చేసి వీరివద్ద నుండి 11 బాక్సులు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.