న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఐదోరోజు తొలి సెషన్ లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 4/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ కు లాథమ్ (35), సోమర్విలే(36) నిలకడగా ఆడారు. తొలి సెషన్ లో భారత బౌలర్లు 31 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లంచ్ సమయానికి 79/1 స్కోరు సాధించింది. ఆ జట్టు విజయం సాధించాలంటే చివరి 2 సెషన్లలో 205 పరుగులు చేయాలి. రెండో సెషన్ లో భారత్ కు శుభారంభం దక్కింది. ఉమేశ్ యాదవ్ వేసిన 36వ ఓవర్ తొలి బంతికే సోమర్విలే (36) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం లాథమ్ (35), కేన్ విలియమ్సన్(0) క్రీజులో ఉన్నారు.