అమరావతి : తప్పుడు నివేదికలతో జగన్ ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపి కేశినేని నాని అన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసత్యప్రచారం చేయడం వైకాపాకు అలవాటుగా మారిందన్నారు. నంద్యాల ప్రజలు తెదేపాను గెలిపించేందుకు సన్నద్ధమయ్యారని తెలిపారు. సాక్షిపత్రిక, టీవీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా ఆయన పేర్కొన్నారు.