ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూసైడ్ బాంబర్లపై తాలిబన్ హోంమంత్రి ప్రశంసలు

international |  Suryaa Desk  | Published : Wed, Oct 20, 2021, 09:08 AM

 ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. వారు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 125 డాలర్లు, ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.


ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com