ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నక్కా ఆనంద్‌బాబు ఇంట్రి వద్ద ఉద్రిక్తత..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 03:04 PM

గుంటూరు : గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు.. నిరాకరించిన నక్కా ఆనంద్‌బాబు. గుంటూరులోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు,  నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది.విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆనంద్  బాబు ఇంటికి వెళ్లి గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.రాత్రి సమయంలో పోలీసులు రావడంపై ఆనంద్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు


గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది.విశాఖలో గంజాయి రవాణాకు సంబంధించి ఆనంద్ బాబు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు విజయసాయిరెడ్టిపై ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. దీనిపై నోటీసులు జారీ చేసేందుకు ఆనంద్ బాబుకు ఇంటికి విశాఖ జిల్లా నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వచ్చారు.రాత్రి సమయంలో పోలీసులు రావటంపై ఆనంద్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆనంద్ బాబును కోరారు.తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి సోమవారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. 


 


 


మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? ప్రస్తుత డీజీపీ కొత్త సంస్కృతి తెస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా? అని ఆనంద్‌బాబు ప్రశ్నించారు.గంజాయి రవాణాపై ఆధారాలు లేదా వివరణ ఇవ్వాలని ఆనంద్‌బాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనంద్‌బాబు అర్ధరాత్రి స్టేట్‌మెంట్‌ ఇవ్వను అన్నారు. అందుకే మంగళవారం ఉదయం వస్తామని చెప్పాం. స్టేట్‌మెంట్‌ ఇవ్వకుంటే 91 సీఆర్ఫీఎఫ్‌ కింద నోటీసులు ఇస్తాం. అప్పుడు చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com