క్యాండీ: మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య చివరి టెస్టు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సస్పెన్షన్కు గురైన రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంక జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. లక్ష్మణ్ సందాకన్, కుమారా, ఫెర్నాండో తుది జట్టుకి ఎంపికయ్యారు.
ఈ మ్యాచ్లో కోహ్లీసేన విజయం సాధిస్తే శ్రీలంకను వారి సొంతగడ్డపై 3-0తో వైట్వాష్ చేసిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అలాగే 85ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనూ ఏ కెప్టెన్కూ సాధ్యం కాని ఘనతను విరాట్ అందుకుంటాడు.