గోరఖ్ పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఇక్కడి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేసి ఆసుపత్రిలో ఈ ఉదయం మరో ఇద్దరు చిన్నారులు మరణించారు. దీంతో గత మూడు రోజులలలో ఆసుపత్రిలో మరణించిన చిన్నారుల సంఖ్య 60 కి చేరుకుంది. చిన్నారుల మరణానికి ఆక్సిజన్ అందకపోవడమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారుల మరణాలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.