లాహోర్: పాకిస్థాన్ మాజీ ఫస్ట్ లేడీ బేగమ్ కుల్సూమ్ నవాజ్ తన భర్త స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. పనామా కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్ఏ-120 లాహోర్ నియోజకవర్గం నుంచి షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ పోటీపడనున్నారు. ఇవాళ ఆమె తరపున లాహోర్ ఎన్నికల ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నుంచి డాక్టర్ యాస్మిన్ రషీద్ పోటీ చేస్తున్నారు. ఆమె కూడా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సెప్టెంబర్ 17న ఉప ఎన్నిక జరగనున్నది.