ఇస్లామాబాద్: నార్త్వెస్ట్ పాకిస్థాన్లోని గిరిజన ఆవాస ప్రాంతంలో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా..26 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని..వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. నవాగై తహసీల్ పరిధిలోని చాహర్మంగ్ ప్రాంతంలో దుండగులు కార్మికులను లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆర్మీ అధికారుల బృందం చేరుకుని అనుమానాస్పద ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.