చిత్తూరు జిల్లా టౌన్లోని చర్చి వీధిలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అపూర్వ టెక్స్టైల్ షాపులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 7గంటలపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. మంటలు అదుపులోకి వచ్చిన కొద్దిసేపటికే టెక్స్టైల్ షాపు భవనం కుప్పకూలింది. పూల మార్కెట్ పూర్తిగా ధ్వంసమైంది. సుమారు రూ.5కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాపు భవనం కుప్పకూలడంతో ఒక్కసారిగా రెండో భవనానికి మంటలు వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్తుండుగా, టెక్స్టైల్స్కు ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మ్ నుంచి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగిందని యాజమాన్యం చెబుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.