విజయవాడ: జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబును ఇష్టానుసారం మాట్లాడుతున్న జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు విశాఖ మెంటల్ హాస్పిటల్లో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు.